Nepal | నేపాల్ ( Nepal)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ధడింగ్ (Dhading) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖాట్మాండు (Kathmandu) నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెనీ హిల్లీ జిల్లా (Beni-hilly district)కు వెళ్తున్న బస్సు రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజూరి వద్ద బుధవారం ఉదయం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి త్రిశూలి నది (Trishuli River)లోకి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 19 మంది గాయపడ్డారు. ‘గజూరి రూరల్ మున్సిపాలిటీ ప్రాంతంలో ఈ ఉదయం బస్సు ప్రమాదానికి గురైంది. త్రిశూలి నదిలోకి బస్సు దూసుకెళ్లింది. 8 మంది మృతి చెందారు. 19 మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’ అని ధడింగ్ ఎస్పీ గౌతమ్ మిశ్రా తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నట్లు చెప్పారు.
Also Read..
Serena Williams | రెండోసారి తల్లైన సెరెనా విలియమ్స్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి
Google Employee | గంట పని.. జీతం మాత్రం రూ.1.2 కోట్లు..!