రాజన్న సరిసిల్ల/కోనారావుపేట : లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ షాపు యజమానికి అధికారులు మూడు వేల రూపాయల జరిమానా విధించారు. ఈ సంఘటన జిల్లాలోని కోనారావుపేటలో చోటు చేసుకుంది. కోనారావుపేటలో గుండ రవి అనే వ్యక్తి లౌక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి ఉదయం 10 దాటిన తర్వాత కూడా కిరాణం షాపులో క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో కోనరావుపేట పంచాయతీ కార్యదర్శి సంతోశ్ వాడవాడలా లాక్డౌన్ తీరును పరిశీలిస్తుండగా కిరాణం షాపు తెరిచి అమ్మకాలు సాగిస్తున్న విషయాన్ని గమనించాడు. దుకాణం దారుడిని మందలించి రూ. 3 వేల జరిమానా విధించారు.
ఇవి కూడా చదవండి..
అనంతగిరిలో కొవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తాం
రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన మంత్రి అల్లోల
బావిలోంచి బాలుడి మృతదేహం వెలికితీత
సుందర్ లాల్ బహుగుణ మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం