ఆదిలాబాద్ : నిర్మల్ పట్టణం బస్ స్టాండ్ ముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులను శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను పాదయాత్ర చేసి దగ్గరుండి పరిశీలించారు. మురికి కాలువల నిర్మాణం, ఫుట్ పాత్ రెలింగ్, ఆటో స్టాండ్, నాగమాత ఆలయం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి మాట్లాడారు.
రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. అతి త్వరలోనే పనులన్ని పూర్తయి నిర్మల్ పట్టణానికి మరింత శోభ రానుందన్నారు. జాతీయ జెండా ప్రాంతంలో పార్కు ను ఏర్పాటు చేస్తామని, బస్టాండ్ ప్రాంతంలో సమీకృత వ్యవసాయ మార్కెట్ ను నిర్మిచనున్నామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, విప్ నేరేళ్ల వేణు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.