మహబూబాబాద్ : జిల్లా కేంద్రం శివారులో శనివారం విద్యుదాఘాతంతో తొమ్మిది పశువులు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్న కిష్టాపురం గ్రామపంచాయతీ శివారు అడ్డాసిగూడకు చెందిన ఇస్లావత్ మోహన్, గుగులోత్ లష్కర్, గుగులోత్ అలియా, గుగులోత్ వశ్యా, గుగులోత్ బిక్యా, భూక్య లింగ్యా రైతులకు చెందిన తొమ్మిది పశువులను శనివారం మేత కోసమని పొలం దగ్గర వదిలారు. మధ్యాహ్న సమయంలో విద్యుత్ స్తంభంపై నుంచి తీగ తెగి పశువులపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పశువులు మృతి చెందాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్లో పశువులు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో బాధిత రైతులు కన్నింటి పర్యంతమయ్యారు. తగిన నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా