జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాటారం మండలంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బొప్పారం వాగులో లెవెల్ కాజ్ వే పై నుంచి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మండల కేంద్రానికి ప్రతాపగిరి, బొప్పారం, మర్రిపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోతులవాయి వద్ద బొర్రా వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. లో లెవెల్ కాజ్ వేల వద్ద, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు ఎవరు వాగులు దాట వద్దని అప్రమత్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి