ముంబై,జూలై:లగ్జరీ వెహికల్ బ్రాండ్ బీఎమ్డబ్ల్యూ మోటోరాడ్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇటీవల మార్కెట్లోకి ఆవిష్కరించిన విషయం తెలిసిందే…”బీఎమ్డబ్ల్యూ సీఈ04 “పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ను అందుబాటులోకి తెచ్చింది బీఎమ్డబ్ల్యూ.
సరికొత్త డిజైన్ తో..
డిఫరెంట్ స్టైల్,మోడ్రన్ డిజైన్, అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో బిఎమ్డబ్ల్యూ సిఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారు చేశారు. స్కేట్ బోర్డ్ మాదిరిగా డిజైన్ చేశారు. అందుకోసం డాప్లర్ ఫ్రేమ్ను ఉపయోగించారు. ఈ స్కూటర్లో ఎల్ఈడీ డీఆర్ఎల్లతో కూడిన ‘వి’ ఆకారపు హెడ్ల్యాంప్, సింగిల్ పీస్ సీట్,మల్టీ-లేయర్ ఫ్లోర్ బోర్డ్, ఎత్తుగా ఉండే హ్యాండిల్బార్ వంటి సరికొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ మోటర్ గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.బ్రష్-లెస్ డిసి ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఇది బెల్ట్ డ్రైవ్తో నడుస్తుంది. సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా కాకుండా ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ మధ్య భాగంలో ఉండి, బెల్ట్ సాయంతో ముందుకు నడిపిస్తుంది.
రెండు వేరియంట్లలో…
ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్,అవాంట్గార్డ్ స్టైల్. ఇందులోని స్టాండర్డ్ వేరియంట్ వైట్ అండ్ మ్యాట్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. అవాంట్గార్డ్ స్టైల్ వేరియంట్ గ్రే మెటాలిక్ అండ్ బ్లాక్,ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్స్ తో గార్నిష్ చేశారు. స్కూటర్ లుక్ పెంచడానికి ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్ను వినియోగించారు. ఆకర్షణీయమైన శైలిలో ఉండే అద్దాలు, రిఫ్లెక్టర్లు, బ్రేక్ లైట్లు ,టైర్ హ్యాకర్లను అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్ట్రైన్ విషయానికి వస్తే, ఇందులో 8.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించారు. దీనిని ఫుల్ గా చార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 4గంటల 20 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది.