హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వెంట్లుకు అధికారం, ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలని రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. గురువారం హైదరాబాద్ సంస్కృతి హాల్లో ఇన్స్పైర్2024 పేరిట కార్యక్రమం నిర్వహించారు. దీనికి గవర్నర్ హాజరై, ఇటీవల విడుదలైన 2023 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ టాప్ ర్యాంకర్లతో సమావేశమయ్యారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టాపర్లతో పాటు వారి కుటుంబాలను గవర్నర్ సన్మానించారు. కార్యక్రమంలో రాజ్భవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉన్నారు.