జయశంకర్ భూపాలపల్లి : ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టమని భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం స్థానిక జీఎం కార్యాలయ ఆవరణలో 31 మంది సింగరేణి వారసులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి సంస్థ ప్రగతికి అంకితభావంతో పనిచేయాలన్నారు. సింగరేణి సంస్థలో ఉద్యోగంలో చేరిన నాటి నుంచే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కోసం పట్టుదలతో కృషి చేయాలన్నారు.
చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. నూతనంగా ఉద్యోగం పొందిన యువతకు జీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యావంతులైన మీరు అంకితభావంతో పని చేస్తూ భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగ పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సింగరేణి అధికారులు విజయ ప్రసాద్, రామలింగం, తుకారాం, కార్మిక సంఘాల ప్రతినిధులు బడితల సమ్మయ్య, మోట పలుకుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.