హైదరాబాద్: నగర శివార్లలోని మైలార్దేవ్పల్లిలో రౌడీషీటర్ అసద్ హత్య కేసులు పోలీసులు పురోగతి సాధించారు. అసద్ హత్యకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మరికొద్దిసేపట్లో డీసీపీ ప్రకాశ్ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
మైలార్దేవ్పల్లిలోని ఇండియా ఫంక్షన్ హాలు వద్ద గురువారం మధ్యాహ్నం మజ్లిస్ నాయకుడు అసద్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆటోలో వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు అసద్పై వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
2018లో వియ్యంకుడు అంజద్ఖాన్ను అసద్ హత్య చేశాడు. ఈనేపథ్యంలో తండ్రిని చంపినవారిపై క్షక్షతీర్చుకునేందుకు అంజద్ ఖాన్ కుమారులు మరో ముగ్గురితో కలిసి అసద్ను హత్య చేసినట్లు భావిస్తున్నారు. నాలుగేండ్ల క్రితం అంజద్ ఖాన్ కుమారుడికి రౌడీ షీటర్ అసద్ కూతురుతో వివాహం జరిగింది. ఏడాది తర్వాత మనస్ఫర్ధలతో దంపతులు విడిపోయారు. దంపతుల మధ్య గొడవకు అంజద్ ఖానే కారణమని భావించిన అసద్.. 2018లో అతన్ని శాస్త్రీపురంలో హత్య చేశాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..