Well Collapses | జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావి (Well )లో పడిపోయిన ఓ ఎద్దును కాపాడేందుకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాంచీ (Ranchi ) జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
రాష్ట్ర రాజధాని రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలోని పిస్కా గ్రామం (Piska village)లో గురువారం సాయంత్రం ఓ ఎద్దు బావిలో పడిపోయింది. అది గమనించిన స్థానికులు కొందరు దాన్ని రక్షించేందుకు ప్రయత్నించారు. తాళ్ల సాయంతో నలుగురు బావిలోకి దిగారు. పైన మరికొంతమంది వ్యక్తులు తాళ్లను పట్టుకుని ఉన్నారు. ఆ సమయంలో బావిపై కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో బావిలోని నలుగురు అందులో కూరుకుపోయారు. పైన ఉన్న వ్యక్తులు కూడా బావిలో పడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు కొందరిని రక్షించారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) విచారం వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read..
Himachal Pradesh | జలప్రళయంతో రూ.10వేల కోట్లు నష్టపోయిన హిమాచల్.. 74 మంది మృతి
Kiara Advani | ఆ విషయంలో నాకు నేనే పోటీ.. కియారా అద్వానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!