Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సోమవారం ఉదయం కడలూరు-పన్రుటి మధ్య రెండు ప్రైవేటు బస్సులు వెళ్తున్నాయి. కడలూరు (Cuddalore) జిల్లా నెల్లికుప్పం (Nellikuppam) సమీపంలోని పట్టంబాక్కం వద్దకు రాగానే ఒక బస్సు ముందు టైరు పేలింది. దీంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 80 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ( MK Stalin ) తీవ్ర దిగ్బ్రాంతి
వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి
రూ.50వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
#WATCH | Tamil Nadu | Around 70 people injured in a collision between two private buses in Melpattampakkam of Cuddalore district. The injured have been taken to Cuddalore government hospital. Further details awaited. pic.twitter.com/TX9H5pA1AF
— ANI (@ANI) June 19, 2023
Also Read..
Adipurush | నేపాల్ లో ఆదిపురుష్ పై వివాదం.. భారత్ సినిమాలపై ఖాట్మాండ్లో నిషేధం
Nepal Floods | నేపాల్ లో వరద బీభత్సం.. 5 మంది మృతి.. 28 మంది గల్లంతు
Hardeep Singh Nijja | కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది కాల్చివేత