Encounter | తమిళనాడు (Tamil Nadu)లో జరిగిన ఎన్ కౌంటర్ (Encounter)లో ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులు మృతి చెందారు. చెన్నై సమీపంలోని గుడువంచేరీ (Guduvanchery) వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
గుడువంచేరీలో సోమవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఎస్ యూవీ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, అందులో ఉన్న నలుగురు వ్యక్తులు వాహనాన్ని ఆపకపోగా.. పోలీసు పెట్రోలింగ్ కారును ఢీ కొట్టారు. అనంతరం పోలీసులపై దాడి చేసి, బాంబు విసిరారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు వినోద్, రమేశ్ గా గుర్తించారు. వీరు పలు హత్యలు, దాడి కేసుల్లో నిందితులని పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు ఘటనాస్థలి నుంచి పారిపోయినట్లు తెలిపారు.
Also Read..
Ukraine | జెలెన్ స్కీ స్వస్థలంపై రష్యా ప్రతీకార దాడి.. చిన్నారి సహా ఆరుగురు మృతి
Joe Biden | షర్ట్ లేకుండా బీచ్ డేని ఆస్వాదిస్తున్న అమెరికా అధ్యక్షుడు.. పిక్ వైరల్