పెద్దపల్లి: జిల్లాలోని అంతర్గాం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. జిల్లాలోని ఈసంపేటకు చెందిన గుణవతి, శ్రీశైలం భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీశైలం తల్లి సారమ్మ కూడా వారితోనే ఉంటున్నది. అయితే గత మంగళవారం కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీశైలం కుమారులైన శివానంద్ (12), శరణ్ (10) ఇవాళ మృతిచెందారు. కరీంనగర్లోనే మరో దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీశైలంతోపాటు అతని భార్య, తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కలుషిత ఆహారం తినడంతోనే వారు అస్వస్థతకు గురైనట్లు అనుమానిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..