Road Accident | అస్సాం (Assam) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోలాఘాట్లోని డెర్గావ్ ( Dergaon) సమీపంలో గల బలిజం ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును (bus collides with truck ) బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోలాఘాట్ నుంచి టిన్సుకియా వైపు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. అదే మార్గంలో ఎదురుగా వస్తున్న బొగ్గులోడు ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
#WATCH | Assam: At least 12 people died and 25 others injured after a bus collided with a truck in Golaghat district. The accident took place at around 5 am in Balijan area near Dergaon in Golaghat: Rajen Singh, Golaghat SP pic.twitter.com/1F9JavLkJh
— ANI (@ANI) January 3, 2024
Also Read..
Japan Earthquake | శిథిలాల కింద మృతదేహాలు.. 62కు చేరిన జపాన్ భూకంప మరణాలు
Explosion | చర్లపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ పేలుడు.. భయాందోళనలో స్థానికులు