టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదల కాగా..తొలి రోజు నుంచి మంచి టాక్తో ప్రదర్శించబడుతోంది. వీక్ డేస్లో కీలకమైన సోమవారం కూడా మంచి కలెక్షన్లు రాట్టింది. మొత్తానికి ఫస్ట్ వీకెండ్లో మంచి బిజినెస్ చేసింది.
వేసవి సెలవులు కావడం, బాక్సాపీస్ వద్ద సినిమాకు పోటీ ఏం లేకపోవడం, మొదటి వారం రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం రావడం..ఇలా ప్రతీది సినిమా కమర్షియల్ సక్సెస్లో భాగమయ్యాయనండంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గురువారం నుంచి సినిమా టికెట్స్ (SVP Ticket Rates) తగ్గనున్నాయి. మళ్లీ మనుపటి ధరల్లోనే సినిమా స్క్రీనింగ్ కానుంది. దీంతో సెకండ్ వీకెండ్లో సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం పడేలా ఉందని అంటున్నారు సినీ పండితులు.
ఈ చిత్రం మాస్ పీపుల్తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా థియేటర్లలోకి తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్కు రప్పించిన సినిమాలు అంటే ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట మాత్రమే. ఓ వైపు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా పూర్తవుతున్నాయి. మే 20న (ఈ శుక్రవారం) నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమాతోపాటు రాజశేఖర్ నటించిన శేఖర్ చిత్రాలు రాబోతున్నాయి.
మరి ఓ వైపు టికెట్స్ ధరలు తగ్గడం..మరోవైపు కొత్త సినిమాలు వస్తుండటంతో..సెకండ్ వీక్లో సర్కారు వారి పాటకు స్పందన ఎలా ఉండబోతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.