‘మా’ ఎన్నికల్లో (Maa Elections) ప్రకాశ్రాజ్(Prakash Raj) ఓడిపోయిన నేపథ్యంలో ఆయనకు మద్దతు తెలిపిన నాగబాబు మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేదని ఈ సందర్భంగా నాగబాబు అన్నారు. నాగబాబు నిర్ణయం ఇండస్ట్రీలో సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu)మీడియాతో మాట్లాడుతూ..నాగబాబు ఆవేశంతో ‘మా’ ప్రాథమిక సభ్యత్వ రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, ఆయన రాజీనామాను ఆమోదించమని అన్నారు.
ప్రమాణ స్వీకారం పై రేపు స్పష్టత ఇస్తానన్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటానని విష్ణు స్పష్టం చేశారు. చిరంజీవి మొదట నన్ను విత్ డ్రా చేసుకోమన్నారు. రాంచరణ్ నాకు మంచి మిత్రుడు. నాన్ తెలుగు ఫ్యాక్టర్ వల్ల గెలవడాన్ని నేను నమ్మను. రాంచరణ్ ఓటు ప్రకాశ్రాజ్కే వెళ్లిందని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ప్రకాశ్రాజ్ అంటే నాకిష్టం. మేమంతా ఎన్నికలయ్యేంత వరకు సన్నిహితంగా ఉన్నాం. ప్రకాశ్రాజ్ ఐడియాలు, ఆయన మద్దతు కూడా కావాలి. ఆయన రాజీనామా కూడా అమోదించబోమని విష్ణు స్పష్టం చేశారు
‘మా’ ఎన్నికల్లో దక్కిన విజయం అందరిదని నటుడు మోహన్ బాబు అన్నారు. ఓటు ఎటు వేసినా ఇది అందరి విజయంగా ఆయన అభివర్ణించారు. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే భయపడి కాదు. గురి చూసి పంజా విసురుతుంది. అన్నీ నవ్వుతో స్వీకరించాలి. నేను అసమర్థుడిని కాదు. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. చెప్పాల్సిన సమయంలో సమాధానాలు చెప్పాలి. మాలో ఏం జరుగుతుందో అందరూ గమనిస్తున్నారని మోహన్ బాబు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Divorce: విడాకులకి సిద్ధమవుతున్న మరో తెలుగు హీరో..నిజమెంత?
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు