ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). యాక్టింగ్ పరంగా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం క్రిష్ (Krish) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొండపాలెం ( Kondapalem Novel) నవల ఆధారంగా తెరకెక్కుతుంది, ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
మేకర్స్ ఈ మూవీని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. గతంలోనే పూర్తి కావాల్సిన ఈ మూవీ వీఎఫ్ ఎక్స్ పనుల్లో కోవిడ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆలస్యం నెలకొంది. అయితే ఇపుడు ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి కావడంతో మేకర్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీకి వచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. క్రిష్-వైష్ణవ్ తేజ్ ప్రాజెక్టు విడుదలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ డీ గ్లామరైజ్ డ్ పాత్రలో నటిస్తోంది.
డైరెక్టర్ క్రిష్ నల్లమల అటవీ ప్రాంతంలో 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం విశేషం. ఈ ప్రాజెక్టుకు కొండపాలెం, జంగిల్ బుక్ టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు టాక్. తొలుత ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫాంలోనే విడుదల చేస్తారని వార్తలు రాగా..ఈ మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్లలో రిలీజ్ చేసేందుకే మేకర్స్ మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతోంది.
ఇవికూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్