తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో చిన్న సినిమాలు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ తో అసోసియేట్ అవుతూ మంచి రోజులొచ్చాయి సినిమా చేస్తోంది యూవీ కాన్సెప్ట్స్.
ఈ సినిమాను రూ.3.5 కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మిస్తుండగా..ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఆహా ప్లాట్ఫాం కు అమ్మేశారట మేకర్స్. అంతేకాదు యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న మారుతి-గోపీచంద్ సినిమా పక్కా కమర్షియల్, సంతోష్ శోభన్ సినిమా, శ్రద్దా శ్రీనాథ్-మహి డైరెక్షన్ లో వస్తున్న చిత్రాల (మరో మూడు సినిమాలు)ను ఆహా ప్లాట్ఫాం కొనుగోలు చేసిందట. తాజా సమాచారం ప్రకారం మొత్తం నాలుగు చిత్రాలకు ఆహా రూ.17 కోట్లతో డీల్ కుదుర్చుకున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..