సెకండ్ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత గత శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీఓపెన్ అయ్యాయి. 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు నిర్వహించుకోవచ్చని తెలంగాణలో అనుమతులు కూడా వచ్చాయి. అయితే ఏపీలో నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తూ 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు నిర్వహించుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ రాబోతుందంటూ హెచ్చరికలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ ( Tollywood )లో పెద్ద సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు సినీ జనాలు.
విడుదలకు సిద్దంగా ఉన్న లవ్ స్టోరీ, టక్ జగదీష్ చిత్రాలు జులై చివరి వారంలోనే ప్రేక్షకుల ముందుకు తేవాలని మొదట మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ థియేటర్స్ రీఓపెన్ అయిన తర్వాత ప్లాన్ కు బ్రేక్ పడ్డది. ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేయబోతున్నట్టు వార్తలు వచ్చినా..ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో విడుదల విషయంలో ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కేసుల పర్యవేక్షణ అనంతరం పరిస్థితులు అనుకూలించిన తర్వాతే పెద్ద సినిమాల విడుదలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని లేటెస్ట్ టాక్. అంతా అనుకూలిస్తే ఆగస్టు చివరి కల్లా పెద్ద చిత్రాల విడుదలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో