బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ( Karan Johar ) బిగ్ బాస్ ఓటీటీ ( Bigg Boss OTT ) ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆరు వారాలపాటు ఈ షో కొనసాగనుంది. ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం Voot లో ఆగస్టు 8 నుంచి ప్రసారం కానుంది. అయితే చాలా ప్రొఫెషనల్ గా ఉండే ఈ దిగ్గజ దర్శకుడిని ఓ విషయం చాలా భయానికి గురిచేస్తుందట. ఓ ఇంటర్వ్యూ లో అదేంటో చెప్పాడు కరణ్ జోహార్.
తన పిల్లలు రూహి, యశ్ కు దూరంగా ఉండాలంటే చాలా భయమేస్తుందన్నాడు. తన సంతోషానికి కారణం రూహి, యశ్. అలాంటిది సుదీర్ఘ కాలంపాటు వారి దగ్గర లేకపోవడం చంపడం లాంటిదేనంటూ తన బాధను చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్. ఇక బిగ్ బాస్ ఓటీటీ షో విషయానికొస్తే మొదటి కంటస్టంట్ గా ప్లే బ్యాక్ సింగర్ నేహా బాసిన్ ను ఎంపిక చేశారు మేకర్స్.
స్వాగ్ సే స్వాగత్, నై జానాతోపాటు మరెన్నో సాంగ్స్ తో మ్యూజిక్ లవర్స్ ను ఉర్రూతలూగించింది నేహా బాసిన్. డిజిటల్ ఎక్స్ క్లూజివ్ పూర్తయిన తర్వాత ఈ షో బిగ్ బాస్ సీజన్ 15 లాంఛింగ్ తో కలర్స్ టీవీకి మారనుంది. బిగ్ బాస్ సీజన్ 15కు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉండబోతున్నాడు.
ఇవి కూడా చదవండి..
Mahesh Babu Sarkaru Vaari Paata |మహేశ్ బాబు ఫస్ట్ లుక్ సరికొత్త రికార్డు
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో..ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం..వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..