బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోల్లో ఒకరు సల్మాన్ ఖాన్ (Salman Khan). ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం టైగర్ 3 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ ఫర్హద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కభి ఈద్ కభి దివాళి (Kabhi Eid Kabhi Diwali) షూటింగ్తో బిజీగా ఉన్నాడు. షూటింగ్ మే 11న ముంబైలో వేసిన స్పెషల్ సెట్లో మొదలైంది. ఇదిలా ఉంటే సల్మాన్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి ఇపుడు ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.
టాలీవుడ్ (Tollywood) స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ఇపుడు సల్లూభాయ్తో సినిమా చేయబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కల్యాణ్తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ పనుల్లో ఉన్నట్టు ఫిలినగర్ సర్కిల్ టాక్. ఇక మరోవైపు హరీష్ శంకర్ రీసెంట్గా సల్మాన్ ను కలవడంతో..త్వరలోనే సల్మాన్ తో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి.
హరీష్ శంకర్ స్క్రిప్ట్ పనులను మొదలుపెట్టాడని..త్వరలో సల్లూభాయ్ను కలిసి కథ వినిపించబోతున్నాడని, స్టోరీ కుదిరితే సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అన్న అప్డేట్ ఇపుడు వైరల్గా మారింది. మొత్తానికి ప్రాజెక్టు ఫైనల్ అవుతుందా..? లేదా అనేది పక్కన పెడితే..ఇపుడీ క్రేజీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్పై ఎలా ఉండబోతుంద మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్లో కీ రోల్ పోషిస్తున్నాడు సల్లూభాయ్. చిత్రీకరణ కూడా పూర్తి చేశాడు. మరోవైపు కభి ఈద్ కభి దివాళి చిత్రంలో వెంకటేశ్ కీ రోల్ చేయబోతున్నాడు. ఇదంతా చూస్తే సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు సినీ జనాలు. బాలీవుడ్ సెలబ్రిటీలు తెలుగు సినిమాల్లో నటించేందుకు, ఇక్కడి డైరెక్టర్లతో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటమే ట్రెండ్ మారుతుందనడానికి ఉదాహరణగా చెప్పొచ్చు.