మెగా ఫాన్స్ మధ్య చీలిక వచ్చింది అనేది కాదనలేని నిజం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు దీనిపై మెగా హీరోలు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. మా మధ్య ఎలాంటి పొరపాచ్చాలు లేవు.. అభిమానులు కూడా ఎలాంటివి పెట్టుకోవద్దు అంటూ వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు చేసే పనులు మాత్రం అలా లేవు అనేది బయటికి కనిపిస్తున్న సత్యం. తాజాగా మరోసారి ఇదే జరిగింది అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా హైదరాబాద్ కోకాపేట ఆవరణలో అల్లు స్టూడియోస్ నిర్మించారు. దాని ఓపెనింగ్ కు వచ్చిన చిరంజీవి ఎందుకు అన్యమానస్కంగా కనిపించాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా తన మాటలతో మెగా అభిమానులను నిట్ట నిలువుగా చీల్చేశాడు.
ఆయన మాట్లాడుతూ.. తనను ఇంతగా ఆదరించిన మెగా అభిమానులకు.. నా ఆర్మీకి, ఫ్యాన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ తెలిపాడు బన్నీ. దీన్ని బట్టి మెగా ఫాన్స్.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేర్వేరు అని ఆయనే డిసైడ్ చేశాడు. గతంలో కూడా కొన్ని సినిమాల ఆడియో వేడుకలలో అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సెపరేట్గా ప్రమోట్ చేసుకున్నాడు అల్లు వారబ్బాయి. మెగా ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చి సొంత కుంపటి పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఆయన విజయాల్లో ఉన్నాడు.. దానికి తోడు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది కాబట్టి తన సొంతంగా ఎదిగాను అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు బన్నీ.
మెగా సపోర్టు ఉన్నా కూడా అల్లు అర్జున్ అనేవాడు ప్రత్యేకంగా ఉంటాడు.. ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు.. ఒక్కడే అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పడానికి పదేపదే ప్రయత్నిస్తున్నాడు అల్లు వారబ్బాయి. బన్నీ మాటలకు చిరంజీవి కాస్త హర్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఎంత సపోర్ట్ చేసినా కూడా చివరికి సొంతంగానే ఎదిగాను.. ఎవరి అండదండలు లేవని చెప్పుకోవడానికి ఇవన్నీ ప్రయత్నిస్తున్న తీరు చూసి ఆయన కాస్త అసంతృప్తిలో ఉన్నట్టు మెగా వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దానికి తోడు పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కు ఉన్న గ్యాప్ కూడా అభిమానుల మధ్య ఎక్కువగా గ్యాప్ పెంచుతుంది. ఏదేమైనా మెగా ఫాన్స్ అనేది ఇప్పుడు ఒక్కరు కాదు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒకవైపు ఉంటే.. అల్లు అర్జున్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ వచ్చింది. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..