బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) చాలా మంది తెలుగు హీరోలతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సల్లూభాయ్ ప్రస్తుతం చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న గాడ్ ఫాదర్ (Godfather)లో కీ రోల్ చేస్తున్నాడు. అక్టోబర్ 5న సినిమా విడులవుతున్న నేపథ్యంలో టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ప్రమోషనల్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్ చేశాడు.
రాంచరణ్ (Ram Charan) తన కొత్త సినిమా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) లో సినిమాలో భాగం కాబోతున్నాడని చరణ్ మొదటిసారి చెప్పినప్పుడు అదొక జోక్ అనుకున్నా. కానీ తర్వాతి రోజే రాంచరణ్ క్యారవాన్లో సినిమా షూటింగ్ కోసం వచ్చేశాడు. రాంచరణ్ నా సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. దగ్గుబాటి వెంకటేశ్, రాంచరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని..తన కెరీర్లో వన్ ఆఫ్ ది బెంచ్ మార్క్ సినిమాగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు సల్లూభాయ్.
అంతేకాదు జనాలు హాలీవుడ్కు వెళ్లాలని అనుకుంటున్నారని, కానీ తాను మాత్రం సౌత్కు వెళ్లాలనుకుంటున్నాని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు సల్మాన్ ఖాన్. సాజిద్ నదియావాలా కథనందిస్తున్న ఈ చిత్రాన్ని ఫర్హద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. పూజాహెగ్డే, జగపతిబాబు కీ రోల్స్ చేస్తున్నారు. రాంచరణ్, సల్మాన్ ఖాన్ సిల్వర్ స్క్రీన్పై మెరువబోతున్నారన్న వార్త ఇపుడు ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 షూటింగ్తో బిజీగా ఉన్నాడు. సల్మాన్ ఖాన్ టైగర్ ప్రాంఛైజీలో వస్తున్న టైగర్ 3 ప్రాజెక్టులో నటిస్తున్నాడు. దీంతోపాటు షారుక్ ఖాన్ నటిస్తున్న పఠాన్లో అతిథి పాత్రలో మెరువబోతున్నాడు.
Read Also : PS-1 US collections | యూఎస్ బాక్సాఫీస్ వద్ద పొన్నియన్ సెల్వన్-1 హవా..కలెక్షన్లివే
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఎస్ఎస్ రాజమౌళి..వీడియో
Read Also : HHVM Workshop Stills | ‘హరిహరవీరమల్లు’ వర్క్ షాప్ స్టిల్స్ వైరల్