తెలుగు ఇండస్ట్రీలో నాగార్జునకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా అమ్మాయిలలో ఇప్పటికీ మన్మథుడే ఈయన. నాగార్జున పేరు చెబితే చాలు ఇప్పటికీ లేడీస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో పాటు సోషల్ మీడియాలో కూడా నాగార్జున చాలా యాక్టీవ్గా ఉంటాడు. తన యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అభిమానులు వాటిని చూసి పండగ చేసుకుంటారు. తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటాడు. ఇక ఇప్పుడు రానా దగ్గుబాటి నెంబర్ వన్ యారి షోకు వచ్చాడు నాగార్జున. తన వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్తో కలిసి వచ్చాడు. అందులో చాలా ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై నాగార్జున ఓపెన్ అయ్యాడు. ఏడేళ్ల కింద కొత్తగా వచ్చింది అని ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేశానని నాగార్జున చెప్పాడు. అయితే అందులో నోటిఫికేషన్స్ చూస్తుంటే మాత్రం తన జీవితాన్ని ఎదుటివాడికి తగ్గట్టుగా మార్చుకోవాల్సిందే అనే విషయం చాలా త్వరగా తనకు అర్థమైందని చెప్పాడు నాగార్జున.
ఆ నోటిఫికేషన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఉచిత సలహాలు ఇస్తారని ఆయన చెప్పాడు. ఏం తినాలి.. ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది కూడా వాళ్లే చెబుతున్నారు అంటున్నాడు నాగార్జున. ఎవరో అనామకులు వచ్చి ఇవన్నీ చెప్తే వాటిని ఎలా పాటించాలో తనకు అర్థం కాలేదని చెప్పుకొచ్చాడు. అందుకే ఆ తర్వాత ట్విట్టర్లో నోటిఫికేషన్ పూర్తిగా ఆఫ్ చేశానని తెలిపాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటి జోలికి పోలేదని తెలిపాడు మన్మథుడు. ఇదిలా ఉంటే ఈయన నటించిన వైల్డ్ డాగ్ సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి