ఇప్పుడు అభిమానులు కూడా ఇదే అడుగుతున్నారు. ఎంతసేపు ముగ్గురమ్మాయిలు కనిపిస్తున్నారు కానీ శృతి హాసన్ మాత్రం కనిపించడం లేదు. మొన్న ట్రైలర్ విడుదల అయినప్పుడు అందులో కనీసం ఒక్క ఫ్రేమ్ కూడా కనిపించలేదు. సినిమాలో హీరోయిన్ విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. 2 నిమిషాల 9 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్లో కనీసం ఒక్క క్షణం కూడా హీరోయిన్ శృతి హాసన్ కనిపించలేదు. ఇది చూసిన తర్వాత ఆమె అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. అందుకే సోషల్ మీడియాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పవన్ తన సినిమాలో అమ్మాయిలకు న్యాయం చేస్తున్నాడు కానీ బయట హీరోయిన్కు మాత్రం అన్యాయం చేస్తున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ ప్రమోషన్స్కు శృతిహాసన్ రావడం లేదు. సినిమాలో ఆమెది కేవలం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్య ఉండే పాత్ర. అందుకే ప్రమోషన్స్కు కూడా రావడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఎంత తక్కువ నిడివి ఉన్న కూడా ..హీరోయిన్ను కనీసం ఒక్క షాట్లో కూడా చూపించకపోవడం దారుణం అంటూ శృతి హాసన్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ట్రైలర్లో నివేదా థామస్, అంజలి, అనన్యను అంత సేపు చూపించారు కానీ కావాలనే తమ హీరోయిన్ను దాచేశారు అంటూ వాళ్లు మండి పడుతున్నారు. ఈ విషయంలో శ్రుతి హాసన్ కూడా కాస్త హర్ట్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. తన విజువల్ ఒక్కటైన వేసుంటే బాగుండేది అని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అలా జరగలేదు అందుకే ప్రమోషన్స్కు రావడం లేదని తెలుస్తోంది.
నిజానికి వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ చాలా తక్కువ నిడివితో ఉంటుంది. మన తెలుగు ప్రేక్షకుల కోసం ఈ పాత్ర నిడివి ఇంకాస్త పెంచినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో చూపించకపోయినా సినిమాలో ఈమె పాత్ర చాలా బాగుంటుందని.. కచ్చితంగా మంచి పేరు వస్తుంది అంటూ చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మొదట్లోనే రవితేజ క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది శృతి హాసన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాతో వస్తోంది. మరోవైపు ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి