టాలీవుడ్ (Tollywood) భామ సమంత (Samantha) ఇటీవలే అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల తర్వాత సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా మారేందుకు షెడ్యూల్ రెడీ చేసుకుంది. ఇప్పటికే గుణ శేఖర్ (Gunasekhar)దర్శకత్వంలో చేస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది. పలు హిందీ ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టింది సామ్. అయితే సమంతకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్లో రౌండప్ చేస్తుంది.
అక్కినేని నాగార్జున (Nagarjuna)హోం బ్యానర్ అన్నపూర్ణ స్డూడియోస్ (Annapurna Studios)లో సమంత ప్రత్యక్షమైందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇంతకీ సామ్ స్టూడియోలోకి రావడానికి కారణమేంటనే కదా మీ డౌటు. తాజా అప్డేట్ ప్రకారం శాకుంతలం డబ్బింగ్ కోసం స్టూడియోలో ప్రత్యక్షమైనట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.. మొత్తానికి సామ్ ఇలా విడాకుల తర్వాత మొదటిసారి స్టూడియోకు రావడంపై అందరూ తెగ చర్చించుకుంటున్నారు.
సమంత మరోవైపు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కాతువాకుల రెండు కాధల్ చిత్రంలో నటిస్తోంది. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండిఇది కూడా చూడండి
ఇది కూడా చూడండి
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్కపూర్
Katrina Vicky Kaushal wedding | జైపూర్ వెడ్డింగ్ కంటే ముందు మరో వెడ్డింగ్..!
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!