జడ్పీటీసీ రామేశ్వరి
నిడమనూరు, ఏప్రిల్ 26 : పాఠశాలల్లో ప్రయోగాల ద్వారా విద్యను బోధించడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిడమనూరు జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి అన్నారు. మండలంలోని 8 జడ్పీ ఉన్నత పాఠశాలలకు జిల్లా పరిషత్ నిధులతో అందిస్తున్న సైన్స్ పరికరాలను సోమవారం ఆమె మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో హెచ్ఎంలకు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు రూ.1.25 లక్షలు మంజూరు కాగా రూ.50 వేల విలువ చేసే పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. రూ.75 వేలతో పాఠశాల భవనాల మరమ్మతుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఎల్.బాలూనాయక్, ప్రధానోపాధ్యాయులు శంకరయ్య, నర్సిరెడ్డి, బాబు, నర్సింహ, శ్రీనివాస్, నాయకులు నందికొండ మట్టారెడ్డి, ముంగి శివమారయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మజ్జిగపు దయాకర్రెడ్డి పాల్గొన్నారు.
ఉన్నత పాఠశాలలకు సైన్స్ కిట్లు పంపిణీ
మాడ్గులపల్లి : మండలంలోని 7 ఉన్నత పాఠశాలలకు జడ్పీ నిధులతో కొనుగోలు చేసిన సైన్స్ పరికరాలను సోమవారం జడ్పీటీసీ పుల్లెంల సైదులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు రూ. 50వేల విలువ చేసే పరికరాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జితేందర్రెడ్డి, నాయకులు పోకల రాజు, ఎరుకల వెంకన్న, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఆస్ట్రేలియా క్రికెటర్ పెద్ద మనసు.. ఆక్సిజన్ కోసం పీఎం కేర్స్కు విరాళం
నటుడు పొట్టి వీరయ్యకు టాలీవుడ్ నివాళి