హైదరాబాద్ : ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య మృతదేహానికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళి అర్పించింది. నట దంపతులు జీవితా, డాక్టర్ రాజశేఖర్తో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు వీరయ్య మృతదేహాన్ని సందర్శించి పుష్పాంజలి సమర్పించారు. వీరయ్య గుండెపోటు కారణంగా ఆదివారం సాయంత్రం మృతిచెందిన సంగతి తెలిసిందే.
వీరయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి వీరయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వీరయ్య జీవితంలో చాలా పోరాటాలను ఎదుర్కొన్నాడన్నారు. ఐదు దశాబ్దాలుగా వివిధ భాషా చిత్రాలలో నటించిన వీరయ్య తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడని చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.
పరిశ్రమకు చెందిన వారి నుండి ప్రేమ, మద్దతు లభించకపోతే తాను బ్రతికి ఉండేవాడిని కాదని వీరయ్య వివిధ ఇంటర్వ్యూలలో పేర్కొన్నాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి లభించిన నగదు సహాయం, మద్దతు కారణంగా మాత్రమే తాను తినేందుకు, ఆశ్రయం పొందేందుకు పెద్దగా ఇబ్బంది పడకుండా జీవితాన్ని గడపగలిగినట్లు తెలిపాడు.