డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్
నర్సింహులపేటలో కొవిడ్ వాక్సినేషన్ సెంటర్ ప్రారంభం
నర్సింహులపేట, ఏప్రిల్ 19 : రాష్ట్ర ప్రజలను కొవిడ్ బారి నుంచి కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని ఈమేరకు వ్యాక్సిన్ వేసే కేంద్రాలను పెంచుతున్నదని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. సోమవారం నర్సింహులపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించి, ఆ తర్వాత కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నదని. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలన్నారు. నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు దంతాలపల్లి పీహెచ్సీకి వెళ్లడం ఇబ్బందిగా ఉండడంతో స్థానికంగా వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం స్థలం గుర్తించామని త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 45 వేల మందికి వ్యాక్సిన్ వేశామని డీఎంహెచ్వో శ్రీరాం తెలిపారు. దంతాలపల్లి మండలంలో ప్రతిరోజూ 150 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నప్పటికీ 450మందికి పైగా టీకా వేస్తున్నామని చెప్పారు. సర్పంచ్ వేముల రజితారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంపీపీ టేకుల సు శీల, జడ్పీటీసీ భూక్యా సంగీత, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు టేకుల యాదగిరిరెడ్డి, వైస్ ఎంపీపీ జాటోతు దేవేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, వైద్యాధికారులు సతీశ్కుమార్, ప్రవీ ణ్, సర్పంచ్, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షు లు శంకర్గౌడ్, రవి, దామోదర్రెడ్డి, ఎస్సై నరేశ్, సీహెచ్వో బాలాజీ, ఎంపీవో సోంలాల్, సత్యనారయణ, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా రెండో వేవ్.. స్టాక్స్ విలవిల.. ఇన్వెస్టర్ హరీ
సైఫన్ సిస్టం సామర్థ్యం పెంచాలని ఈఎన్సీకి వినతి