మహబూబ్ నగర్ : ఆసియాలోనే మొట్టమొదటి సైఫన్ సిస్టంతో పనిచేసే సరళా సాగర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచాలని కోరుతూ.. నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావును దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కలిశారు. సామర్థ్యం పెంపుతో అదనపు ఆయకట్టు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే ఈఎన్సీకి విజ్ఞప్తి చేశారు.
దీనితో పాటు మూసాపేట మండలం నిజాలాపూర్ చెక్ డ్యాం ఎత్తు పెంచాలని, దీని ద్వారా అదనంగా 1200 ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు.
చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామ చెరువు నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని తద్వారా జమ్మికుంట, నల్లకుంట, ఎర్రకుంట చెరువులు నింపి ఆయకట్టును పెంచుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈ అంశాలపై సీఎం కేసీఆర్ కు సైతం వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన మహబూబాబాద్ పోలీసులు
ఇల్లంతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
కూలీల ఆటో బోల్తా ..నలుగురికి తీవ్ర గాయాలు