Jamuna Biopic | వెండితెర సత్యభామ దివికేగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి జమున (86) శుక్రవారం కన్నుమూశారు. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న జమున మరణం పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. జమున నిష్క్రమణంతో తెలుగు చిత్రసీమలో ఓ సువర్ణాధ్యాయం ముగిసిందని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె బయోపిక్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది.
జమున బయోపిక్ తీసేందుకు చర్చలు జరుగుతున్నాయని సినీ ఇండస్ట్రీలో ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జమున బయోపిక్ను ఒక కళాఖండంగా రూపొందించే బాధ్యతను కోలీవుడ్కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ తీసుకున్నారట. జమున బతికున్నప్పుడే ఆయన ఈ స్క్రిప్టు వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేశారని సమాచారం. ఆమె ఉన్నప్పుడే సినిమాను కూడా మొదలు పెట్టాలని భావించారట.. కానీ ఇంతలోనే మరణించడం తీవ్ర విషాదకరమని కోలీవుడ్లో చెప్పుకుంటున్నారు.
జమున జీవితంలోని ప్రతి కోణాన్ని ఈ బయోపిక్లో ఆవిష్కరించబోతున్నారని సమాచారం. జమున సినిమా ఎంట్రీ, ఆత్మాభిమానంతో ఆమె తీసుకున్న నిర్ణయాలు, గొడవలు, ప్రేమ, పెళ్లి వంటి అంశాలన్నింటినీ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ మిల్క్ బ్యూటీ తమన్నా అయితేనే సెట్ అవుతుందని మేకర్స్ అనుకుంటున్నారట. ఇదే విషయమై తమన్నాతో కూడా చర్చలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేశ్కు మహానటి సినిమాతో ఎంత క్రేజ్ వచ్చిందో.. తమన్నాకు కూడా జమున బయోపిక్తో అంతే సక్సెస్ వస్తుందో లేదో చూడాలి.
Mandeep Roy | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత