Sushant Singh Rajput | సుశాంత్ సింగ్ మరణించి మూడేళ్లు దాటిపోయినా ఎవరూ మరిచిపోలేకపోతున్నారు. ఆయన గురించి ఇప్పటికీ ఎవరో ఒకరూ స్పందిస్తూనే ఉన్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోలు, స్టార్ కిడ్స్కు సంబంధించి ఏ కొత్త సినిమా రిలీజవుతున్నా సుశాంత్కు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకుని బాధపడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా స్పందించాడు. సుశాంత్ మరణానికి ముందు అతనితో వ్యవహరించిన తీరు గుర్తుకు తెచ్చుకుని తెగ బాధపడ్డాడు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం నిజంగా చాలా దురదృష్టకరమని బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. అతని మరణ వార్త తెలిసి ఎంతగానో బాధపడ్డానన తెలిపారు. సుశాంత్ చనిపోవడానికి మూడు వారాల ఉందు అతని టీమ్ నుంచి తనకు ఓ మెసేజ్ వచ్చిందని అనురాగ్ కశ్యప్ గుర్తుచేసుకున్నారు. సుశాంత్ తనను కలవాలని అనుకుంటున్నాడని.. సినిమా చేయాలని చూస్తున్నాడని నాకు మెసేజ్ వచ్చింది. కానీ నేను పట్టించుకోలేదు. సినిమా చేయడం కుదరదని చెప్పేశానని గుర్తుచేసుకున్నాడు. గతంలో తన సినిమా చేయలేదనే కోపంతో అలా మాట్లాడనని చెప్పాడు. కానీ సుశాంత్ మరణించిన తర్వాత ఈ విషయంలో చాలా గిల్టీగా ఫీలయ్యానని తెలిపాడు.
అందుకే ఇటీవల అభయ్ డియోల్తో గొడవలు వచ్చినప్పుడు కూడా ముందుగా తానే రియాక్ట్ అయ్యానని చెప్పాడు. తన గురించి పబ్లిక్గా మాట్లాడటంతో అభయ్ ఫీలయ్యాడని తెలిసి.. మరేం ఆలోచించకుండా క్షమాపణలు చెప్పానని తెలిపాడు.