న్యూఢిల్లీ: ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానం(IndiGo Flight) ఇవాళ గుజరాత్లోని రాజ్కోట్లో ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేసింది. కార్గో ప్రాంతంలో పొగను విమాన సిబ్బంది గుర్తించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇండిగో ఫ్లయిట్ 6ఈ 1452 నెంబర్ విమానంలో సుమారు 194 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత ప్రయాణికులు అందరూ సురక్షితంగా దిగారు. కార్గో ప్రాంతంలో స్మోక్ రావడంతో విమాన పైలట్లు తక్షణమే రాజ్కోట్ ఎయిర్పోర్టును కాంటాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫుల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అయితే ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు రాజ్కోట్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ దిగాంత బోరా తెలిపారు. ఇండిగో విమానం సంస్థ సుమారు 80 దేశీయ, 30 అంతర్జాతీయ విమానాలను నడుపుతున్నది. ఆ సంస్థ వద్ద ఎయిర్బస్ ఏ320, ఏ321 విమానాలు ఉన్నాయి. ఏటీఆర్72-600 టర్బోప్రాప్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఉన్నది.