Mandeep Roy | సినీ నటి జమున, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణాలు మరువక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు మన్దీప్ రాయ్ కన్నుమూశారు. గుండెపోటుతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మన్దీప్ రాయ్ మృతి పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మన్దీప్ రాయ్ నిజానికి బెంగాలీ అయినప్పటికీ కర్ణాటకలోనే స్థిరపడ్డాడు. శాండిల్వుడ్లో దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించాడు. 1980లో మించిన ఒట సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పుష్పక విమానం, దేవర ఆట, ఆప్త రక్షక, అమృతధార వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా 2021లో వచ్చిన ఆటో రమణ సినిమాలో కనిపించాడు. అనారోగ్యం కారణంగా ఇంటి వద్దే ఉంటున్న మన్దీప్కు నెలకిందట కూడా గుండెపోటు వచ్చింది. అప్పుడు చికిత్స తీసుకోవడంతో కోలుకున్నారు. గుండెకు సర్జరీ చేయాల్సి ఉందని అప్పుడు సూచించారు. ఈ క్రమంలోనే మరోసారి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి కన్నుమూశాడు. ఈ విషయాన్ని మన్దీప్ కూతురు అక్షిత వెల్లడించారు.