రష్మిక మందన్నా (Rashmika mandanna)..కొంతకాలంగా ఈ భామ ఏ సినిమాలో నటించినా మినిమమ్ గ్యారంటీ హిట్టు పడ్డట్టే. ఛలో, గీత గీవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప సినిమాలే దీనికి నిదర్శనం. డియర్ కామ్రేడ్ ఒకటి బాక్సాపీస్ వద్ద బోల్తా పడ్డా అది రష్మిక కెరీర్ మీద మాత్రం అంతగా ప్రభావం చూపలేదు. అయితే ఈ భామ ఖాతాలో ఫ్రెష్గా ఓ ఫెయిల్యూర్ పడిపోయినట్టేనని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఈ పాటికే అర్థమై ఉంటుంది.
శర్వానంద్ (Sharwanand) హీరోగా కిశోర్ తిరుమల (Kishore Tirumala) డైరెక్షన్లో లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందని టాలీవుడ్ సర్కిల్ టాక్. 2021చివరలో పుష్ప రూపంలో బిగ్గెస్ట్ హిట్టు ఖాతాలో వేసుకున్న శ్రీవల్లికి..2022 ప్రథమార్థంలో మాత్రం ఆద్యగా అంతగా సక్సెస్ రాలేదని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఆద్య పాత్ర నచ్చే ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నానని రష్మిక చెప్పుకొచ్చింది.
అయితే ఆమెకు నచ్చినంతగా ఈ పాత్ర అంత గొప్ప ఫీల్ అందించేలా మాత్రం లేదని అంటున్నారు మూవీ లవర్స్. రష్మిక ఈ చిత్రాన్ని కేవలం రెమ్యునరేషన్ యాంగిల్లో మాత్రమే చేసిందని మరో టాక్ కూడా ఉంది. కిశోర్ తిరుమల లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథను ప్రేక్షకుల అంచనాలను తగ్గట్టుగా చూపించలేకపోయాడని పలువురు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి రష్మికకు ప్లాప్ మాట అటుంచితే..కొంతకాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు శర్వానంద్. గతేడాది చివరలో వచ్చిన మహాసముద్రంతో ఇప్పటికే ఓ ఫెయిల్యూర్ ఖాతాలో వేసుకున్న శర్వానంద్కు తాజా చిత్రం కూడా నిరాశనే మిగిల్చిందనే అంటున్నారు.
.