తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో శింబు. ఈ స్టార్ హీరో నటించిన మానాడు (Maanaadu) చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. శింబుకు మంచి సక్సెస్ ఇచ్చిన కమ్ బ్యాక్ సినిమాగా నిలిచింది. కాగా ఈ సినిమాను తెలుగులో రానాతో రీమేక్ చేయబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆసక్తికర అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో వచ్చిన ఈ చిత్రం రీమేక్ హక్కులను తెలుగు అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్ దక్కించుకుందట.
సురేశ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళంలో ఈ చిత్రానికి కథ, దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu). ఎస్జే సూర్య, కల్యాణి ప్రియదర్శిని కీలక పాత్రలు పోషించారు. కాగా తెలుగులో ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఇంకో ఆసక్తికర వార్త ఏంటంటే తెలుగు వెర్షన్లో రవితేజ, సిద్దు నటించబోతున్నారట. ప్రస్తుతానికి దీనిపై అఫీషియల్ అప్డేట్ ఏం లేకున్నా. ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
ఇక రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రావణాసుర, ధమాకాతోపాటు పాన్ ఇండియా ప్రాజెక్టు టైగర్ నాగేశ్వర్ రావు మాస్ మహారాజా జాబితాలో ఉన్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మరి మానాడు రీమేక్పై రానున్న రోజుల్లో ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.
Read Also : Nandamuri Balakrishna | సినిమాల్లోకి బాలకృష్ణ చిన్నకూతురు..క్రేజీ టాక్లో నిజమెంత ?
Read Also : Yashoda | డేట్ను రౌండప్ చేస్తూ.. యశోద సినిమా విడుదలపై సమంత టీం హింట్ ..!
Read Also :Anushka Shetty | కాంతార సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి : అనుష్క