కొన్ని సినిమాలకు యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. ఆ సినిమాలో ఉండే కథలు అన్ని ఇండస్ట్రీలో ప్రేక్షకులకు కూడా నచ్చుతాయి. గత కొన్నేళ్లలో మలయాళ ఇండస్ట్రీలో అలాంటి కథలు ఎక్కువగా వస్తున్నాయి. దృశ్యం సినిమానే దీనికి నిదర్శనం. అన్ని భాషల్లో ఈ సినిమా రీమేక్ అయింది. చైనా, శ్రీలంక భాషలలో కూడా దృశ్యం సినిమాను రీమేక్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమా కూడా అన్ని భాషలలో రీమేక్ అవుతోంది. అదే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ (Ayyappanum Koshiyum).
ఆత్మాభిమానానికి, అహంకారానికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. దివంగత దర్శకుడు సాచి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే తెలుగులో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. అక్కడ జాన్ అబ్రహాం (John Abraham ), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan )ప్రధాన పాత్రల్లో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెరకెక్కనుంది.
ఈ సినిమా పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ హిందీ రీమేక్ ప్రాజెక్టు నుంచి అభిషేక్ బచ్చన్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో మరో హీరో కోసం దర్శక నిర్మాతలు వెతుకుతున్నారు. అయితే ఈ సినిమా నుంచి అభిషేక్ ఎందుకు తప్పుకున్నాడు అనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు.
బహుశా ఆయన పాత్ర తక్కువ చేస్తున్నారు అనే అనుమానంతోనే జూనియర్ బచ్చన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ హిందీ రీమేక్ నుంచి తప్పుకొని ఉండొచ్చు అంటున్నారు అభిమానులు. కాగా తెలుగులో కూడా పవన్ కల్యాణ్ (Pawankalyan) కోసం రానా (Rana)పాత్రను తగ్గిస్తున్నారు అంటూ దగ్గుబాటి అభిమానులు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. టైటిల్ కూడా కేవలం పవన్ కల్యాణ్ పేరు వచ్చేలా భీమ్లా నాయక్ కన్ఫర్మ్ చేశారు. మరి హిందీలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. తమిళంలో కూడా ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచన చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర