టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య (Acharya). కొరటాల శివ ( Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గరకొస్తున్న నేపథ్యంలో మేకర్స్ ప్రి రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 23న హైదరాబాద్ (hyderabad)లో ఈవెంట్ జరుగనుంది. ముందుగా ఈ ఈవెంట్ను విజయవాడలో నిర్వహించాలని ప్లాన్ చేయగా..ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.
అయితే చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్థలాన్ని విజయవాడ నుంచి హైదరాబాద్కు మార్చేశారు. పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఈవెంట్కు వస్తే అభిమానులు అప్ సెట్ అయ్యే అవకాశాలుంటాయని భావించిన ఆచార్య టీం ఈవెంట్ వేదికను విజయవాడ టు హైదరాబాద్కు మార్చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఆచార్య ఈవెంట్కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్యఅతిథిగా రాబోతున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. సాధారణంగా పవన్తోపాటు మిగిలిన హీరోల ఫంక్షన్లకు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వెళ్తుంటాడు. అయితే ఈ సారి మాత్రం చిరు వేడుకకు తమ్ముడు పవన్ కల్యాణ్ వస్తున్నాడని అప్ డేట్ రావడంతో అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. పవన్ హాజరయ్యే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.