టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచరణ్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడీ హీరో. రాంచరణ్తోపాటు ఎన్టీఆర్ నటనకు మూవీ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ఆర్సీ 15 (RC15) షూటింగ్లో పాల్గొంటున్నాడు. రాంచరణ్ అండ్ టీంపై అమృత్సర్లో షూటింగ్ కొనసాగుతోంది. కాగా రాంచరణ్ సతీమణి ఉపాసన (Upasana Konidela) గోల్డెన్ టెంపుల్ (Golden Temple)ను సందర్శించారు. టెంపుల్లో లంగర్ సేవలో పాల్గొన్నారు.
ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది. అభిమానుల ప్రేమతో ఆర్ఆర్ఆర్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో.. ‘కృతజ్ఞతా చిహ్నంగా మిస్టర్ సీ తరపున అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో లంగర్ సేవను నిర్వహించాం ఉపాసన. చరణ్ #RC15 షూటింగ్లో ఉండటం వల్ల అతని తరపున ఈ సేవలో పాల్గొనడం జరిగింది. రామ్ చరణ్, ను మీ ప్రేమాభిమానాలతో ఆశీర్వదించబడ్డామని వినయపర్వకంగా అంగీకరిస్తున్నాం..’అంటూ ట్వీట్ చేసింది ఉపాసన.
As a mark of gratitude Mr.C hosted a langar seva at the golden temple in Amritsar.
I had the privilege & opportunity to represent him by participating in the seva as he was shooting for #RC15Rc & I feel blessed with with your love & accept it with humility @AlwaysRamCharan pic.twitter.com/Tz8GYDO4bx
— Upasana Konidela (@upasanakonidela) April 19, 2022
పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఫే మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సునీల్, అంజలి, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమృత్ సర్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు టాక్.