కోలీవుడ్ స్టార్ హీరో ఆర్ మాధవన్ (R Madhavan) పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్ (Vedaant) స్మిమ్మింగ్ పోటీల్లో ఇండియాకు సిల్వర్ మెడల్ సాధించి పెట్టాడు. కోపెన్ హాగన్ (R Madhavan)లో జరిగిన డానిష్ ఓపెన్ 2022 (Danish Open 2022) పోటీల్లో 1500 మీ ఫ్రీ స్టైల్ ఈవెంట్ (15:57:86 టైంలో) సిల్వర్ మెడల్ సాధించాడు. వేదాంత్ కు సిల్వర్ మెడల్ను ప్రకటిస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేశాడు మాధవన్. తన కొడుకు భారతదేశం గర్వించేలా చేశాడని సందేశాన్ని పోస్ట్ చేశాడు.
వేదాంత్ మాధవన్ డానిష్ ఓపెన్లో భారత్ తరపున సిల్వర్ మెడల్ అందుకున్నాడు. ప్రదీప్ (స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) సార్, అన్సాద్కు ధన్యవాదాలు. మీ అందరి కృషి ఫలించింది. మేమంతా చాలా గర్విస్తున్నాం అని సందేశాన్ని రాసుకొచ్చాడు. ఇక దేశాన్ని మరోసారి గర్వంగా తలెత్తుకునేలా చేసిన యువ చాంపియన్ వేదాంత్కు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, నమ్రతాశిరోద్కర్ తోపాటు నెటిజన్లు, ఫాలోవర్లు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
క్రీడల్లో నిపుణుడైన వేదాంత్ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. వేదాంత్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక అవార్డులను కైవసం చేసుకున్నాడు. అంతకుముందు కూడా స్వర్ణం, కాంస్య పతకాలను సాధించాడు.