టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ప్రస్తుతం పవన్ కల్యాణ్తో చేయబోతున్న భవదీయుడు భగత్సింగ్ (Bhavadheeyudu Bhagat Singh) సినిమా స్క్రిప్ట్ వర్క్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. క్రిష్తో చేస్తున్న హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఇటీవలే హరీష్ శంకర్ ముంబైలోని మెహబూబా స్టూడియో దగ్గర దిగిన ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ హరీష్ శంకర్ ఏ పని మీద ముంబై వెళ్లిండనే దానిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది.
2018లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgn) నటించిన చిత్రం రైడ్ (Raid). బాక్సాపీస్ వద్ద మంచి హిట్గా నిలిచింది. ఈ సినిమాను హరీష్ శంకర్ తెలుగులో రీమేక్ (Raid Remake) చేయాలని అనుకుంటున్నాడట. అందుకే గత వారం ముంబైని విజిట్ చేశాడన్న టాక్ నడుస్తోంది. అయితే దీనిపై హరీష్ శంకర్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తెలుగు వెబ్ సిరీస్ ATMకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు.
చివరగా వరుణ్తేజ్తో గద్దల కొండ గణేశ్ సినిమా చేశాడు హరీష్శంకర్. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. మరోవైపు ఈ క్రేజీ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో ఓ సినిమా చేయబోతున్నాడని ఇప్పటికే ఓ అప్ డేట్ తెరపైకి రాగా..మరి రానున్న రోజుల్లో దీనిపై ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.