టాలీవుడ్ హీరో రవితేజ సినిమాలంటే ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్. ఈ ఏడాది క్రాక్ సినిమాతో కేక పుట్టించాడు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు. ఖిలాడీ చిత్రంతో బిజీగా ఉంటూనే నూతన దర్శకుడు శరత్ మండవతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. రవితేజ ఈ చిత్రంలో ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడట.
రవితేజను ఇప్పటివరకు ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో చూశారు. ఈ సారి మాత్రం రూట్ మార్చి..నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా కనిపించబతున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. ఈ మూవీకి రవితేజ రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసకుంటున్నట్టు సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంక కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే