1990లలో జమ్మూకశ్మీర్లో తిరుగుబాటు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంబాక్సాపీస్ ను షేక్ చేసింది. తొలిసారి హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal).
ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాపీస్ వద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేయడమే కాదు.. సూపర్ హిట్ టాక్ తోపాటు నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం రూ.250 కోట్ల మార్కును దాటేసినట్టు సమాచారం. ప్రేక్షకుల కోసం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో ప్రీమియర్ కానుంది. ఎప్పుడనేదానిపై మేకర్స్ అఫీషియల్ అప్ డేట్ ఇవ్వనున్నారు.
ఈ చిత్రానికి నిర్మాత అభిషేక్ అగర్వాల్తోపాటు జీ5 సహనిర్మాతగా వ్యవహరించింది. కశ్మీర్ ఫైల్స్ లో బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు.