టాలీవుడ్ (Tollywood) సినీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి పుష్ప (Pushpa). ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar) డైరెక్టర్. డిసెంబర్ 17న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో పుష్ప మేకర్స్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పుష్ప ఐదో షోకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 30 వరకు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మేకర్స్ కు తక్కువ సమయంలోనే పుష్ప మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని తెలుస్తోంది. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika mandanna) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఫస్ట్ పార్టులో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరోవైపు పుష్ప హిందీ వెర్షన్ (Pushpa Hindi version)కు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీచేసే విషయంలో సెన్సార్ సభ్యులు నో చెప్పినట్టు టాక్ రాగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్కు ఫిదా అయిన స్టార్ హీరో