సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న పొట్టి వీరయ్య.. నిన్న దర్శకుడు సాయిబాలాజీ మరణించగా.. తాజాగా మరో దర్శకుడు కన్నుమూశాడు. తమిళ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తమిర అనే దర్శకుడు కరోనాతో మృతిచెందారు. అంతకుముందు పదిరోజుల క్రితం తమిళ కమెడియన్ వివేక్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
కరోనాతో కొన్నిరోజుల క్రితం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన తమిర.. మెల్లగా కోలుకుంటున్నారు. అయితే అంతలోనే మళ్లీ ఆయన ఆరోగ్యం తిరగబెట్టింది. దాంతో ఏప్రిల్ 28న ఉదయం ఆరోగ్యం క్షీణించి కన్నుమూశారు. కరోనాకు తోడు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటమే ఆయన మరణానికి కారణమని వైద్యులు తెలిపారు. కాగా, లెజెండరీ దర్శకులు కె.బాలచందర్ తో పాటు మరికొందరు అగ్ర దర్శకుల దగ్గర తమిర పని చేశారు. వాళ్ల దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేసిన అనుభవంతోనే ఈయన మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తమిర 2010లో కె.బాలచందర్, భారతీరాజాలతో ‘రెట్టసూజి’ అనే సినిమాను తెరకెక్కించారు. 2018లో సముద్రఖని, రమ్యపాండియన్ ప్రధాన పాత్రల్లో ‘ఆన్ దేవతై’ సినిమా తెరకెక్కించారు. ఈయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
కిమ్ శర్మ అందానికి ఫిదా అవ్వాల్సిందే..ట్రెండింగ్లో స్టిల్
పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు.. . ‘వకీల్ సాబ్’ ఓటిటి డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
వకీల్ సాబ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందా?
కరోనాతో సీనియర్ నటి భర్త మృతి
అఫీషియల్: ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నిర్మాణ సంస్థ
మూడో హిందీ చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్..!