బుల్లితెర యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
తన దగ్గర విడతల వారీగా కోటిరూపాయల వరకు డబ్బుని బుల్లితెర నటుడు, యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి అప్పుగా తీసుకున్నారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకపోగా తనపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.
ఓ మధ్యవర్తి మహిళ ద్వారా నర్సింహారెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు ఫైల్ చేసిన నర్సింహారెడ్డితో పాటు మధ్యవర్తి అయిన మహిళను కూడా రిమాండ్ కి తరలించారు.