బాహుబలి (Bahubali) సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా రికార్డులు సృష్టించాడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli). సినిమా ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించే వరకు నిద్రపోడు జక్కన్న. సినిమాకు సంబంధించిన ఒక్కో లుక్ను విడుదల చేస్తూ బాహుబలి సినిమాతో నయా పబ్లిసిటీ స్టంట్ను అందరికీ పరిచయం చేశాడు జక్కన్న. ఈ నిర్ణయంతో సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ దొరకడమే కాదు నిర్మాతలకు కూడా భారం తగ్గింది.
ఇపుడు జక్కన్న టాలీవుడ్కు మరో కొత్త మెథడ్ను పరిచయం చేసి నయా ట్రెండ్ సెట్టర్గా నిలిచాడన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇంతకీ ఆ మెథడ్ ఏంటనే కదా మీ డౌటు. సినిమాకు రెండు విడుదల తేదీ (release dates) లను ప్రకటించడం. ఒక తేదీ కాకపోతే మరో తేదీన సినిమా విడుదల చేస్తామని హింట్ ఇస్తూ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టాడు. ఇపుడిదే ఫార్ములా మిగిలిన దర్శకనిర్మాతలు కూడా ఫాలో అవుతున్నారు. గతంలో రెండు విడుదల తేదీలు ప్రకటించాడు జక్కన్న. ఇపుడు ఆ డేట్స్ ను పక్కన పడేసి తాజాగా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.
ఇదే రూట్లో భీమ్లా నాయక్ (Bheemla Nayak) టీం కూడా వెళ్తోంది. ఫిబ్రవరి 25 కాని, ఏప్రిల్ 1న కాని సినిమా విడుదలవుతుందని మేకర్స్ రివీల్ చేశారు. మరోవైపు వరుణ్ తేజ్ నటిస్తోన్న గని టీం కూడా ఫిబ్రవరి 25, మార్చి 4 తేదీలను ఫిక్స్ చేసింది. కరోనా సంక్షోభం విడుదల తేదీల విషయంలో అయోమయాన్ని కలిగించడంతో జక్కన్న తీసుకున్న నిర్ణయంతో అందరికి కొత్త మార్గం దొరికినట్టైంది.