టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ‘ది ఘోస్ట్’ (The Ghost) చేస్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్తో బిజీగా ఉంది నాగ్ టీం. ఇవాళ కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.
ఈవెంట్కు నాగార్జునతోపాటు అఖిల్, నాగచైతన్య స్పెషల్ విమానంలో బయలుదేరారు. వీరితోపాటు సోనాల్ చౌహాన్ కూడా ఉంది. ప్రయాణం సమయంలో వీరంతా ఫొటో దిగారు. సోనాల్ చౌహాన్ స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని అక్కినేని హీరోలతో కలిసి దిగిన స్టిల్ ఇపుడు సోషల్మీడియాను షేక్ చేస్తుంది. ముగ్గురు హీరోలను ఇలా ఒకే ఫ్రేములో చూసిన అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో తమహగనే అనే ప్రత్యేకమైన ఆయుధాన్ని ఉపయోగించాడు నాగ్. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ది ఘోస్ట్లో గుల్ పనాగ్, అనిఖా సురేంద్ర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్.
Let the madness begin❤️🔥
The Akkineni Trio are gracing #TheGhost 's Pre-Release Event ⚔️
🎟️https://t.co/REV2APLLlm
📍S.T.B.C College Grounds, Kurnool
🕰️ 6PM https://t.co/vdHWBiairW#TheGhost#TheGhostonOct5 @iamnagarjuna @sonalchauhan7 @SVCLLP @nseplofficial pic.twitter.com/nwiNOToJnr— Praveen Sattaru (@PraveenSattaru) September 23, 2022