పెండ్లయిన తర్వాత కొంతకాలంగా విదేశాల్లో చక్కర్లు కొట్టింది టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరోయిన్ శ్రియాశరణ్ (Shriya Saran). ఈ బ్యూటీ తన భర్త ఆండ్రీ కొఛీవ్ (Andrei Koscheev) తో ఇటీవలే మళ్లీ భారత్ లో ల్యాండైంది. అంతేకాదు వచ్చీ రాగానే ముంబైలో తన అభిరుచులకు అనుగుణంగా కొత్తింటిని ఏర్పాటు చేసుకుంది. శ్రియా ముంబైలో ఖరీదైన ప్రాంతం బాంద్రా (Bandra )లోని కొత్తింట్లోకి మకాం మార్చిందన్న వార్త ఇపుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక ముంబైలో శ్రియా-ఆండ్రీవ్ దంపతులు తమ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు.2018లో ఆండ్రీవ్ ను పెండ్లి చేసుకున్న తర్వాత స్పెయిన్ కు వెళ్లిపోయింది శ్రియా. ఆండ్రీవ్ స్పెయిన్ లో పనిచేస్తాడు. ఇక చాలా రోజుల తర్వాత తన స్వస్థలం ముంబైకి తిరిగొచ్చేసింది. సుమారు 3 నెలలపాటు నచ్చిన తన కలల ఇంటిని గుర్తించినట్టు తెలిపింది శ్రియా. బాంద్రాకు మారుతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా అందరితో చెప్పింది.
శ్రియా ప్రస్తుతం క్రిష్ నిర్మిస్తోన్న గమనం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు పాన్ ఇండియా కథాంశంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్రలో నటిస్తోంది.
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!