సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun), కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో తెరకెక్కి..బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది పుష్ప (Pushpa). తెలుగు, తమిళం, మలయాళం, హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్ పుష్ప 2 (Pushpa 2) పైన ఇపుడు అందరి ఫోకస్ పడ్డది. ఎప్పుడెప్పుడు కొత్త అప్ డేట్ వస్తుందా..? అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఇప్పటికే చాలా గాసిప్స్ తెరపైకి వచ్చాయి.
తాజా అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. షూటింగ్ కూడా త్వరలోనే షురూ కానున్నట్టు వార్తలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. సీక్వెల్ సెప్టెంబర్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇన్సైడ్ టాక్. సుకుమార్ అండ్ టీం భారీ షెడ్యూల్ ప్లాన్ రెడీ చేస్తూనే..మరోవైపు లొకేషన్ల వేటలో బిజీగా ఉంది. నటీనటుల ఎంపిక కూడా కొనసాగుతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. ఫస్ట్ పార్టులో ముందుగా అనుకున్న ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించాల్సి ఉండగా..డేట్స్ సర్దుబాటు కాని కారణంగా వర్కవుట్ కాలేదు.
అయితే సెకండ్ పార్టులో మాత్రంపక్కా కనిపించబోతున్నాడని తాజాగా ఓ వార్త హల్ చల్ చేస్తుండగా..దీనిపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఈ సారి సుకుమార్ కొత్త ముఖాలను సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేయబోతున్నాడట. రష్మిక ప్రస్తుతం విజయ్తో వారసుడు సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు బాలీవుడ్ యాక్టర్ రణ్ బీర్ కపూర్తో కలిసి యానిమల్ (Animal) చిత్రంలో కూడా నటిస్తోంది.